భోగి మంటలు వేయడం తెలుగు సంస్కృతి

రథ సారథి, వేములపల్లి :
వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో జర్నలిస్ట్ శీలం వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోజు భోగీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బోగీ మంట వద్ద యువకులు,రైతులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పండుగ జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భోగి మంటలు వేయడం మన సంస్కృతి సాంప్రదాయం అన్నారు,పంటలను చీడ పీడల నుండి రక్షించాలని ప్రార్థిస్తూ,గ్రామ ప్రజలకు బోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు,. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ శీలం ప్రసాద్ గౌడ్, మధు రెడ్డి, రమాకాంత్ గౌడ్, వంశీ గౌడ్, మనోజ్ రెడ్డి, కోటిరెడ్డి, రైతులు లింగారెడ్డి, నాగిరెడ్డి, రంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.