ప్రింటింగ్ ప్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక

రథ సారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ ప్రింటింగ్ ప్రెస్ యజమానుల నూతన కార్యవర్గ సమావేశం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించడం జరిగింది.నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. నూతన అధ్యక్షులుగా కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా కర్నాటి విశ్వనాధ్,కోశాధికారిగా దొంగరి రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్ యజమానుల యొక్క సమస్యల పరిష్కారానికి డిటిపి యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సంఘ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు కోడి జనార్ధన్ ,మామిడాల ఉపేందర్ , తుమురుగో టి చంద్రమౌళి ,జంజిరాల ఈదయ ,సత్యం, విజయ్ కుమార్, యాదగిరి, లోకనాథం, శ్రీనివాస్, అశోక్ మిద్దెల శీను తుప్పతి యాదగిరి, కొట్టే కొండల్, ఈశ్వర్ ,మురళి ,ఆంజనేయులు, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, కుర్షిత్ సోమలింగం, శ్రీను, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.