ముమ్మాటికి గెలవబోయేది బీఆర్‌ఎస్సే : సీఎం కేసీఆర్‌

రథసారథి ,సూర్యాపేట:

అభివృద్ధిపై తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని..

అందులో ఎలాంటి డౌట్‌ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కథలు చెప్పినా.. ఏం మాట్లాడినా.. పోయినసారి కంటే ఇంకో ఐదు ఎక్కువ సీట్లతోని బీఆర్‌ఎస్‌ గెలువబోతుందని జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

‘కల్యాణలక్ష్మీ రోజూ మీరు చూస్తూనే ఉన్నారు. రైతుబీమా చూస్తూనే ఉన్నారు? ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్ల వస్తున్నయో మీకు తెలుసు. 24 గంటల కరెంట్‌ ఎట్ల వస్తుందో మీకు తెలుసు. ఏ విధమైన ప్రజాసంక్షేమం ఉందో మీకు తెలుసు. ఇవన్నీ మీ కండ్ల ముందు జరగుగుతున్నయ్‌.’ అని గుర్తుచేశారు. వీటిగురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు. నేలవిడిచి సాము చేసినట్టు డైలాగులు చెప్పి పిచ్చి లేపి పోయిండ్రు తప్ప.. ప్రజల బాధలు ఏంటనేది పట్టించుకున్న వాళ్లు మాత్రం లేకుండే అని అన్నారు. ఇప్పుడు ఉన్న సదుపాయాలన్నీ ఇంకా మెరుగవ్వాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక్కడికే సంతోషపడవద్దని.. ఇవి ఇంకా పెరగాలి.. ఇంకా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ జరగాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. ఇంకా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయని.. పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని.. సంక్షేమం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇప్పుడొచ్చి ఏది పడితే అది చెబుతారని.. ఆపద మొక్కులు మొక్కుతారని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడంతో మోసపోతే గోసపడాల్సి వస్తుందని హెచ్చరించారు. మీమీ గ్రామాల్లో విచక్షణతో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలకు సూచించారు. సూర్యాపేటలో ఇంత పెద్ద సభ జరిగిందంటే.. నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్టే అని అర్థమవుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్‌ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కథలు చెప్పినా.. ఏం మాట్లాడినా.. పోయినసారి కంటే ఇంకో ఐదు ఎక్కువ సీట్లతోని బీఆర్‌ఎస్‌ గెలువబోతుందని జోస్యం చెప్పారు. అందులో ఏ మాత్రం అనుమానం లేదని.. మరింత ముందుకుపోదామని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ముందుచూపు వలన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది అన్నారు .బడుగు, బలహీనవర్గాలు, కర్షకులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారని దీనికి కేసీఆర్ ఆలోచన విదానమే ప్రధాన కారణం అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని ,సాగు, తాగునీరు సమస్య లేదని, పింఛన్లు సకాలంలో అందుతున్నాయని, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలు అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి అన్నారు. సూర్యాపేటలో ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కేసీఆర్ ఘనతే అన్నారు .ఇవి ఇలాగే కొనసాగాలంటే సూర్యాపేట తో పాటుగా రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ జండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి భారీ ఎత్తున బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.