గంగాధర్ కు నివాళులు

రథ సారథి,మిర్యాలగూడ:

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు తిరునగరు గంగాధర్ 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గల గంగాధర్ విగ్రహానికి ఆయన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు,తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మక్దూం పాషా, కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, నాయకులు మన్నెం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.