సాధినేని శ్రీను గెలుపు కోరుతూ రోడ్ షో..
రథ సారథి,మిర్యాలగూడ:
భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు గెలిపించుకునే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి శోభ కరంధ్లాజే ,,(ఉడిపి చిక్ మంగళూరు) ఎంపీ , స్థానిక
మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఈదులగూడ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె పట్టణంలో పలు చిరు వ్యాపారులను, ప్రజలను పలకరించి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సాధినేని శ్రీనివాస్,అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్, రేపాల పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్ష కార్యదర్శి లు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, బంటు గిరి, బండారు ప్రసాద్, హనుమంత రెడ్డి, వేణు, సరిత, రమాదేవి కాన్సిలర్ లు పాల్గొన్నారు.